News September 26, 2024

ఆ సీన్స్ కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’ రిలీజ్: సెన్సార్ బోర్డ్

image

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను తాము సూచించిన 11 మార్పులు చేస్తేనే విడుదల సాధ్యమని బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. Sept 6న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సిక్కుల అభ్యంతరాలతో నిలిచిపోయింది. తమ వర్గాన్ని తప్పుగా చూపించారని వారు నిరసన వ్యక్తం చేశారు. కాగా నిర్మాణ సంస్థ పిటిషన్‌పై తాజాగా సెన్సార్ బోర్డు ఇలా స్పందించింది. విచారణను హైకోర్టు Sept 30కి వాయిదా వేసింది.

Similar News

News September 15, 2025

ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

image

AP: 1923 – 2019 వ‌ర‌కు రాష్ట్రంలో 12 మెడిక‌ల్ కాలేజీలుంటే, తమ హ‌యాంలో 17 కాలేజీల‌ను సంక‌ల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల‌ను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిష‌న్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

News September 15, 2025

వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

image

జపాన్‌లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

News September 15, 2025

రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించండి: తుమ్మల

image

TG: రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని‌ కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రజత్‌ కుమార్‌ తెలిపారు.