News June 25, 2024

సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ విడుదల

image

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ పాత్రలో అనుప‌మ్ ఖేర్ నటిస్తున్నారు.

Similar News

News October 31, 2025

RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com

News October 31, 2025

దేహంలో దాగి ఉన్న పంచభూతాల లీల

image

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>

News October 31, 2025

కేజ్రీవాల్‌ మరో శీష్ మహల్ కట్టుకున్నారు: బీజేపీ

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్‌ను ఖాళీ చేశాక చండీగఢ్‌లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్‌గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్‌పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.