News August 23, 2025

ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి: బొప్పరాజు

image

AP: ఉద్యోగులకు సంబంధించి ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి. 3 నెలల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Similar News

News March 28, 2026

H-1B ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపు!

image

USలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల వేతనాలను పెంచుతూ లేబర్ డిపార్ట్‌మెంట్ కొత్త ప్రతిపాదనలు చేసింది. H-1B, E-3 వంటి వీసాదారులకు ఇచ్చే మినిమం శాలరీ పెరగనుంది. దీనివల్ల ఏటా ఒక్కో ఉద్యోగికి ₹13 లక్షల అదనపు లబ్ధి చేకూరనుంది. విదేశీయులకు తక్కువ జీతాలిచ్చి స్వదేశీయులను తొలగించకుండా ఉండేందుకే 20 ఏళ్ల పాత వేతన విధానాన్ని మారుస్తున్నారు. వీటిపై అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తారు.

News March 28, 2026

ఆయిల్ పామ్ తోటల్లో పరాగసంపర్కం

image

ఆయిల్ పామ్‌ తోటల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా, కీటకాల ద్వారా జరుగుతుంది. ఇలాయిడోబియస్ కామెరూనికస్ అనే కీటకం పరాగ సంపర్కంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తర్వాత తోటల్లో ఈ కీటకాలను విడుదల చేస్తే ఫలదీకరణ బాగా జరిగి ఫలములు ఏర్పడతాయి. చెట్లు ఆరోగ్యంగా లేకపోతే ఈ కీటకాలను 3 సంవత్సరాల తర్వాత తోటల్లో విడుదల చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 28, 2026

నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

image

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.