News November 9, 2024
అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి: కేసీఆర్

TG: కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని కేసీఆర్ అన్నారు. ‘మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు నిర్మించడానికి. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువ చేశాం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 12, 2025
జియో యూజర్లకు గుడ్న్యూస్

జియో స్టార్తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్స్టార్లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.
News December 12, 2025
వాజ్పేయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సత్యకుమార్

AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘వాజ్పేయ్కు-నాకు-కర్నూలుకు ఓ అనుబంధం ఉంది. నేను 1993లోనే ఢిల్లీ వెళ్లడంతో వాజ్పేయ్తో పరిచయమైంది. 2018లో వాజ్పేయ్ కీర్తిశేషులయ్యాక ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి నా చేతుల మీదుగా పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం దక్కింది’ అని తెలిపారు.
News December 12, 2025
మహిళా జర్నలిస్టుతో శశిథరూర్.. వైరలవుతున్న ఫొటోలు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. థరూర్ భుజంపై ఆమె చేతులు వేసి ఉన్న పోజ్పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. కాగా ఆమె పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ థరూర్ లేదా రంజున్ ఈ విషయంపై స్పందించలేదు.


