News March 31, 2025
ఎంపురాన్@రూ.200 కోట్లు

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2:ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. 5 రోజులు పూర్తికాక ముందే రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది. ఈ నెల 27న మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
Similar News
News April 2, 2025
నేను ఎవరితోనూ డేట్ చేయలేదు: హీరోయిన్

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ దివ్య భారతి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాను ఏ నటుడితో గానీ పెళ్లైన వ్యక్తులతో గానీ డేట్ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దివ్య భారతి, జీవీ కలిసి బ్యాచిలర్, కింగ్స్టన్ మూవీలో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
News April 2, 2025
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.
News April 2, 2025
విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు?

HYDలో అత్యాచారానికి గురైన జర్మనీ యువతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో అందమైన లొకేషన్లు ఉంటాయంటూ ఆ యువతిని నమ్మించి పాతబస్తీకి చెందిన మహ్మద్ అస్లాం (25) పహాడీ షరీఫ్ తీసుకెళ్లాడు. ఆమెతో వచ్చిన ఫ్రెండ్కు కూల్డ్రింక్లో మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ యువతిపై దారుణం జరుగుతున్నా అతడు స్పందించలేదని సమాచారం. ఆ యువతి జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.