News March 27, 2025

భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్

image

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్‌బాగ్‌ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.

Similar News

News January 1, 2026

సర్ఫరాజ్‌ను నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు: వెంగ్‌సర్కార్

image

దేశవాళీ క్రికెట్‌లో భారీగా రన్స్ చేస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశే ఎదురవుతోంది. VHTలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు. “ఇది నిజంగా సిగ్గుచేటు. మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టడం అన్యాయం” అంటూ విమర్శలు గుప్పించారు.

News January 1, 2026

చెడు శకునాలు ఎదురైతే?

image

చెడు శకునాలు ఎదురైనా, అశుభ సంకేతాలు కనిపించినా కొన్ని మార్గాలతో దోష నివారణ చేసుకోవచ్చు. ‘పసుపు కలిపిన గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ విభూతి, తులసి తీర్థం చల్లాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. విజ్ఞులు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దానధర్మాల వల్ల ఆపదల తీవ్రత తగ్గుతుంది. శకునాలు హెచ్చరికలు మాత్రమేనని, సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా కష్టాలను దాటొచ్చని పండితులు చెబుతున్నారు.

News January 1, 2026

ఈనెలలోనే అందుబాటులోకి వందేభారత్ స్లీపర్: కేంద్ర మంత్రి

image

వందేభారత్ స్లీపర్ రైలు జనవరిలో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో తొలి రైలు పరుగులు పెడుతుందని తెలిపారు. 3 టైర్ కోచ్‌లు 11, 2 టైర్ 4, ఫస్ట్ AC కోచ్ 1 ఉంటుందని మొత్తం 823 పాసింజర్లు ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే 6 నెలల్లో మరో 8, ఏడాది చివరికి 12 ట్రైన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. 15-20 రోజుల్లో సర్వీసులు స్టార్ట్ అవుతాయని చెప్పారు.