News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్

జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
Similar News
News December 24, 2025
పడమర దిశలో తల పెట్టి నిద్రపోతున్నారా?

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన దిశలో నిద్రపోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర దిశలో తల పెట్టి, తూర్పు వైపు కాళ్లు చాపి పడుకుంటే మగత నిద్ర వస్తుందని, ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. ‘ఈ దిశలో నిద్రిస్తే పీడకలలు, అర్ధరాత్రి మెలుకువ రావడం వంటి సమస్యలు రావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పనులపై అనాసక్తి, నిరుత్సాహం కలుగుతాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 24, 2025
సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
News December 24, 2025
బాధితులను క్రిమినల్స్గా చూడటం న్యాయమా: రాహుల్ గాంధీ

రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను క్రిమినల్స్గా చూడటం ఏ విధమైన న్యాయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ‘‘ఉన్నావ్’’ అత్యాచార బాధితురాలితో అధికారులు వ్యవహరించిన తీరు కరెక్టేనా? న్యాయం కోరడమే ఆమె చేసిన తప్పా? బాధితురాలిని పదేపదే వేధించారు. ఇప్పటికీ ఆమె భయపడుతూనే బతుకుతున్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు.


