News June 17, 2024
ఎన్కౌంటర్.. నలుగురు నక్సలైట్లు మృతి

ఝార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నలుగురు నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. మృతదేహాలను తరలించి వారి వద్ద ఉన్న ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత శనివారం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Similar News
News November 24, 2025
CBN కోసం పవన్ డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

AP: తిరుమల <<18376126>>లడ్డూ వివాదం<<>>పై Dy.CM పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజాగ్రహం నుంచి చంద్రబాబును కాపాడేందుకు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర, నష్టపరిహారం కోసం పోరాడాల్సిందిపోయి.. పొలిటికల్ డ్రామాలోకి తిరుమలను, లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. తప్పుడు ప్రచారం, ప్రజలను నమ్మించడంలో CBN, పవన్ నిపుణులు. గోబెల్స్ను మించిపోయారు’ అని ఫైరయ్యారు.
News November 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 76 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకు?
జవాబు: రావణుడు పూర్వం నలకూబరుని భార్య రంభను బలవంతం చేశాడు. అప్పుడు కోపగించిన నలకూబరుడు ‘ఇకపై ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా తాకితే నీ తల వంద ముక్కలవుతుంది’ అని రావణుడిని శపించాడు. ఈ శాపం కారణంగానే రావణుడు సీతను ఆమెను ముట్టుకోవడానికి సాహసించలేదు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 24, 2025
మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.


