News August 14, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

image

జమ్మూకశ్మీర్ దోడాలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు వీరమరణం పొందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 20, 2025

APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్‌ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్‌సైట్:sameer.gov.in/

News October 20, 2025

దీపావళికి, గుడ్లగూబకు సంబంధమేంటి?

image

దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారన్న విషయం తెలిసిందే! ఆ అమ్మవారి వాహనమే గుడ్లగూబ. అందుకే నేడు ఆ పక్షిని చూస్తే శుభం కలుగుతుందని చెబుతుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పక్షిని బలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇది మూఢ నమ్మకమేనని పండితులు చెబుతున్నారు. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకొని గుడ్లగూబ వేటగాళ్లు అక్రమ వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దుష్ప్రచారాన్ని సృష్టించార’ని అంటున్నారు.

News October 20, 2025

ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

image

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.