News October 30, 2024
ముగిసిన రాజ్ పాకాల విచారణ

TG: జన్వాడ ఫామ్హౌస్ పార్టీ కేసులో KTR బామ్మర్ది రాజ్ పాకాల విచారణ ముగిసింది. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా 9 గంటల పాటు ఆయన్ను మోకిల పోలీసులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో ఆయన్ను ఫామ్హౌస్కు తీసుకెళ్లిన పోలీసులు గంట పాటు అక్కడ సోదాలు చేపట్టారు. గతంలో ఫామ్హౌస్లో జరిగిన పార్టీలపైనా ఆరా తీశారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
Similar News
News February 12, 2026
రేపు YCP శాసనసభాపక్ష సమావేశం

AP: వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో రేపు ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు MLA, MLCలతో ఆయన భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించనున్నట్లు YCP ట్వీట్ చేసింది. ఇవాళ జగన్తో పాటు అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ సభ్యులు కొంతసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
News February 12, 2026
ఇంగ్లండ్పై వెస్టిండీస్ విజయం

T20WCలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన WI 20 ఓవర్లలో 196 రన్స్ చేసింది. ఛేదనలో సామ్ కరన్(43*), జాకబ్(33), సాల్ట్(30) మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 166 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లలో మోటీ 3, ఛేజ్ 2 వికెట్లు తీశారు. అటు హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో T20ల్లో ఇంగ్లండ్కు ఇది తొలి ఓటమి.
News February 12, 2026
రేపు నమీబియాతో భారత్ మ్యాచ్.. జట్టు ఇదేనా?

T20WCలో భాగంగా రేపు 7pmకు ఢిల్లీ వేదికగా నమీబియాతో భారత జట్టు తలపడనుంది. USAపై గెలుపుతో WCలో బోణీ కొట్టిన ఇండియా రేపటి మ్యాచులోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలి మ్యాచ్లో సూర్య మినహా మిగతా బ్యాటర్లు విఫలం కాగా ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
జట్టు అంచనా: అభిషేక్/శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, హార్దిక్, రింకూ, అక్షర్, అర్ష్దీప్, వరుణ్, బుమ్రా.


