News March 6, 2025
రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 22, 2026
మద్నూర్: GOVT ఆస్పత్రిలో కరెంట్ కట్.. ఏఈ గోపికృష్ణ వివరణ

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో మరమ్మతులు కారణంగానే <<18926314>>విద్యుత్ సరఫరాలో అంతరాయం<<>> ఏర్పడిందని విద్యుత్ శాఖ ఏఈ గోపికృష్ణ తెలిపారు. గురువారం ‘కరెంటు లేక GOVT ఆస్పత్రిలో ఆపరేషన్లు బంద్’ శీర్షికన Way2Newsలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు టీచర్స్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్కు రిపేర్ చేశామని Way2Newsకు తెలిపారు.
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్లో 18 మంది 500 వికెట్లు తీశారు.


