News September 11, 2024
టెస్టు క్రికెట్ను ఇంగ్లండ్ అవమానించింది: మైకేల్ వాన్

ఓవల్ టెస్టులో శ్రీలంక చేతిలో పరాజయంపాలైన ఇంగ్లండ్పై ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. టెస్టు క్రికెట్ను అవమానించిందంటూ మండిపడ్డారు. ‘కొంతకాలం బాగా ఆడి ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ జట్టుకు అలవాటైపోయింది. ఓవల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో వారి తీరు టెస్టుల్నే కాక శ్రీలంకను కూడా అవమానించినట్లు అనిపించింది. వారి అతి దూకుడు ఏమాత్రం సరికాదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


