News June 11, 2024

500 ఏళ్ల నాటి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు ఇవ్వనున్న ఇంగ్లండ్

image

భారత్‌లో దోచుకుని తమ దేశానికి తరలించిన విలువైన పురాతన వస్తువులను విదేశీ ప్రభుత్వాల ఒత్తిడితో ఆంగ్లేయులు తిరిగిచ్చేస్తున్నారు. తాజాగా హిందూ కవి తిరుమంగై ఆళ్వార్‌కు చెందిన 500 ఏళ్లనాటి కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని ఓ ఆలయం నుంచి దొంగిలించారని నాలుగేళ్ల క్రితం UKలోని భారత హైకమిషన్ ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News December 1, 2025

గణనీయంగా తగ్గిన HIV-AIDS కేసులు

image

భారత్‌లో 2010-2024 మధ్య HIV- ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్షిక కొత్త కేసుల నమోదులో 48.7% క్షీణత నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4%, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ సైతం 74.6% తగ్గినట్లు వివరించింది. అటు 2020-21లో 4.13కోట్ల ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2024-25కు ఆ సంఖ్య 6.62కోట్లకు పెంచినట్లు పేర్కొంది.
– నేడు వరల్డ్ ఎయిడ్స్ డే.

News December 1, 2025

డిసెంబర్ నెలలో పర్వదినాలు

image

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి

News December 1, 2025

చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్‌ కాంబినేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.