News September 7, 2025
ఇంగ్లండ్ భారీ స్కోర్.. ఇద్దరు సెంచరీలు

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. రూట్(100), బెతెల్(110) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. మరో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు చేశారు. బట్లర్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సుతో 62* రన్స్ బాదారు. మెన్స్ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ 7సార్లు 400+ స్కోర్ చేసింది. ఈ లిస్టులో సౌతాఫ్రికా(8) టాప్లో ఉంది.
Similar News
News September 8, 2025
ఆసియాకప్ విజేతలు వీరే..

1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.
News September 8, 2025
మూత్ర విసర్జన ఆపినందుకు కాల్చి చంపాడు

USలో గన్ కల్చర్ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హరియాణాకు చెందిన కపిల్ (26) రూ.45 లక్షలు ఖర్చు పెట్టి 2022లో డంకీ రూట్ ద్వారా USకు వెళ్లాడు. అక్కడ అరెస్టై లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా బయటకు వచ్చి కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదం చెలరేగింది. అతడు కాల్పులు జరపడంతో కపిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలాడు.
News September 8, 2025
ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం

TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.