News March 2, 2025
US అధికార భాషగా ఇంగ్లిష్

అమెరికా అధికార భాషగా ఇంగ్లిష్ను ఎంపిక చేస్తూ ఆదేశాలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఆఫీసులు, సంస్థలు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా? వద్దా? అని ఎంచుకోవచ్చు. ఇంగ్లిష్ను అధికార భాషగా తీసుకోవడం ద్వారా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతం అవుతాయని, సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఈ ఆదేశాల్లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News November 18, 2025
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ని కోరుతున్నామన్నారు.
News November 18, 2025
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ని కోరుతున్నామన్నారు.
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.


