News April 16, 2024
బౌలింగ్ చేస్తేనే భారత జట్టులోకి ఎంట్రీ!
రాబోయే టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కాలంటే హార్దిక్ రెగ్యులర్గా బౌలింగ్ చేయాల్సిందేనని BCCI షరతు పెట్టినట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న పాండ్య బౌలింగ్లో విఫలమవుతున్నారు. దీంతో భారత జట్టులో అతడి స్థానం అనుమానంగా మారింది.
Similar News
News October 13, 2024
‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ
‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
News October 13, 2024
సంజూ శాంసన్ సెల్ఫ్లెస్ ప్లేయర్: సూర్య
వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News October 13, 2024
రతన్ టాటా ఓ ఛాంపియన్: నెతన్యాహు
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.