News October 20, 2025
దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.
Similar News
News October 20, 2025
దీపావళి: లక్ష్మీ పూజ విధానం (1/2)

పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో ముగ్గులు, లక్ష్మీదేవి పాద ముద్రలు గీయాలి. పూజా స్థలంలో ధాన్యంపై తెల్లని వస్త్రం పరచి లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. గణపతి వందనంతో పూజ ప్రారంభించి, ఆ తర్వాత శ్రీ సూక్తం పఠిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. తులసి, గంగాజలంతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, చందనంతో అమ్మవారిని అలంకరించాలి. ఈ ప్రక్రియ శుభశక్తులను ఆహ్వానించి, పూజకు మంచి పునాదిని ఏర్పరుస్తుంది.
News October 20, 2025
గొర్రెల్లో ప్రమాదం.. బొబ్బ రోగం(అమ్మతల్లి)

బొబ్బరోగం ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News October 20, 2025
దీపావళి: లక్ష్మీ పూజ విధానం (2/2)

అమ్మవారికి ఇష్టమైన ఎర్ర మందారం, తామర, గులాబీ వంటి పుష్పాలతో పూజ చేయాలి. పాయసం, లడ్డూ వంటి తీపి నైవేద్యాలను సమర్పించాలి. కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ తులసీ దళాలతో ప్రత్యేక పూజ చేయాలి. నూనె, నెయ్యి దీపాలు వెలిగించి, కర్పూర హారతి ఇవ్వాలి. పూజ ముగిశాక, కుటుంబమంతా కలిసి ఇంట్లోని ప్రతి మూలలో దీపాలు వెలిగించి, లక్ష్మీ కథలు పారాయణం చేయాలి. ఈ సంప్రదాయం సంపద, శాంతిని ఇంట్లో స్థిరంగా ఉండేలా చేస్తుంది.