News September 13, 2024

రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

image

AP: వరద నష్టం ఎన్యూమరేషన్ ప్రక్రియలో జాప్యం జరగడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం అంచనాలకే ఇంత ఆలస్యమైతే బాధితులకు పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులను నిలదీశారు. రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తయితేనే కేంద్రానికి వివరాలు పంపగలమనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయాలని సూచించారు.

Similar News

News November 18, 2025

‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

వందల మంది మృతికి హిడ్మానే కారణం!

image

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్‌ ఘాట్‌లో కాంగ్రెస్‌ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి