News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
Similar News
News August 15, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు TGలో WGL, MDK, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ADB, AFB, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది.
News August 15, 2025
రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

AP: తెల్లవారుజామున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనక వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News August 15, 2025
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం

AP: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ్టి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్ని కూడా ప్రారంభించారు. వచ్చే జూన్ 5నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న CM చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సచివాలయం నుంచే చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి అక్కడ ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయనున్నారు.