News April 18, 2025

త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్‌కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్‌డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

Similar News

News April 19, 2025

నేటి నుంచి 10 రోజులు..

image

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News April 19, 2025

విజయసాయికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

image

AP: వైసీపీ కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా? మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే’ అని స్పష్టం చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు.

News April 19, 2025

10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

image

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.

error: Content is protected !!