News June 11, 2024
EPFO: కేవైసీ ఉంటే చెక్ అవసరం లేదు!

ఉద్యోగుల క్లెయిమ్లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.
Similar News
News December 17, 2025
బర్త్డే విషెస్.. CBN, పవన్కు షర్మిల థాంక్స్

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.
News December 17, 2025
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే సిద్ధమైంది. స్లీపర్, ఏసీ 3 టైర్లో ప్రయాణికులు 40Kgలు, 2nd AC ప్యాసింజర్లు 50Kgలు, 1st క్లాస్ ప్రయాణికులకు 70Kgల వరకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. జనరల్ బోగీలో ప్రయాణించే వాళ్లు 35Kgల లగేజీ తీసుకెళ్లవచ్చు. 5-12 ఏళ్ల పిల్లలకు ఆ పరిమితిలో 50% లేదా గరిష్ఠంగా 50Kgల వరకు అనుమతి ఉంటుంది. పరిమితి మించితే అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
News December 17, 2025
మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారుగా: కాంగ్రెస్ MLA

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నట్లు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ‘ఫిరాయింపులపై <<18595871>>BRS<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గతంలో మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. తలసాని, సబితలకు మంత్రి పదవులూ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. తీర్పు నచ్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు’ అని వ్యాఖ్యానించారు.


