News June 11, 2024
EPFO: కేవైసీ ఉంటే చెక్ అవసరం లేదు!

ఉద్యోగుల క్లెయిమ్లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.
Similar News
News December 7, 2025
అక్కడ ఫ్లైట్లు ఎగరవు.. ఎందుకో తెలుసా?

టిబెట్ పీఠభూమిలో ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఫ్లైట్లు నడపడం చాలా కష్టం. 2.5 మిలియన్ల చదరపు కి.మీ విస్తరించి ఉన్న ఆ పీఠభూమిలో సగటున 4,500 మీటర్ల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండటంతో ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీలో ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అక్కడ ఇతర విమానాశ్రయాలు ఉండవు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. వర్షాలు, భారీ ఈదురుగాలులు వీస్తాయి.
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News December 7, 2025
రాష్ట్రంలో 94 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో 94 Jr జడ్జీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 66 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 28 పోస్టులను ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: tshc.gov.in


