News July 1, 2024

EPS విత్‌డ్రా రూల్స్ మారాయ్

image

EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే బెనిఫిట్స్‌ను ఇకపై పని చేసిన నెలల ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఈ స్కీమ్‌లో 10ఏళ్లకు ముందే విత్‌డ్రా చేసుకుంటే బెనిఫిట్స్ అందవు.

Similar News

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It

News April 12, 2026

‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.

News April 12, 2026

ఇంటర్‌: భయంతో ఆత్మహత్య.. కానీ పాసయ్యాడు!

image

TG: ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో రాపల్లికి చెందిన ఇంటర్ MPC ఫస్టియర్ విద్యార్థి అక్షంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇవాళ వెలువడ్డ ఫలితాల్లో అతడు 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
*జీవితం మహాసముద్రం లాంటిది. మార్కులు మాత్రమే మీ భవిష్యత్‌ను నిర్ణయించవు.