News January 13, 2025
పసుపు బోర్డు ఏర్పాటు హర్షణీయం: కిషన్ రెడ్డి

తెలంగాణలోని నిజామాబాద్లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుక అని తెలిపారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
Similar News
News December 24, 2025
మాల్యా భారత్కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
News December 24, 2025
హైకోర్టుల్లో కేసుల విచారణ ఇలా!

హైకోర్టుల్లో కేసుల విచారణ క్రమ పద్ధతిలో జరుగుతుంది. TG HCలో 32, APలో 23 హాళ్లున్నాయి. హాల్-1లో CJ పిల్, రిట్ పిటిషన్లను విచారిస్తారు. 2-3 జడ్జిలుండే డివిజన్ బెంచ్లు(H2-10) క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ కేసులను చేపడతాయి. మిగిలిన హాళ్లలో సింగిల్ బెంచ్లు సివిల్, క్రిమినల్, బెయిల్ పిటిషన్ల వాదనలు వింటాయి. ఈ కేసులే విచారించాలనేది ఫిక్స్ కాదు. <
News December 24, 2025
వైభవ్ డబుల్ సెంచరీ మిస్.. కానీ రికార్డు సృష్టించాడు

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ(బిహార్) విధ్వంసం సృష్టించారు. అరుణాచల్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి ఔటయ్యారు. 10 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. VHT హిస్టరీలో అతి తక్కువ వయసులో(14Y 272D) సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ రికార్డు సృష్టించారు. 1986లో జహూర్ 15 ఏళ్ల 209 రోజుల వయసులో శతకం బాదారు.


