News July 23, 2024
వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు: నిర్మల

మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 బడ్జెట్పై ఆమె ప్రసంగిస్తూ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని హాస్టళ్లు, కేర్ సెంటర్ల ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రూ.3లక్షల కోట్లకు పైగా కేటాయించనున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News October 22, 2025
సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

సర్ఫరాజ్ ఖాన్ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.
News October 22, 2025
AP న్యూస్ రౌండప్

✒ పలు జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఆస్కారం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ ఆదేశాలు
✒ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ఈ నెల 23న తమ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ: YCP
✒ ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి
✒ అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం: చెల్లుబోయిన వేణు
News October 22, 2025
ఐఫోన్కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్పై నాన్బెయిలబుల్ వారెంట్

AP: అమెజాన్పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.