News September 28, 2024
Metaపై EU $100 మిలియన్ల భారీ జరిమానా

ప్రైవసీ బ్రీచ్ కారణంగా Facebook మాతృ సంస్థ Metaపై యూరోపియన్ యూనియన్ $100 మిలియన్ల (రూ.837 కోట్లు) భారీ జరిమానా విధించింది. EU యూజర్ల పాస్వర్డ్లను సరైన ఎన్క్రిప్షన్ లేకుండా ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్లో స్టోర్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈ డేటాను ఎవరైనా యాక్స్స్ చేయగలిగతే యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడినట్టే అని పేర్కొంది. 2019లోనే ఈ సమస్యను మెటా స్వయంగా అంగీకరించడం గమనార్హం.
Similar News
News November 26, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు పూర్తి బందోబస్తు: ఎస్పీ

జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్ జిల్లా, రాష్ట్ర చెక్ పోస్టులను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రభావితం చేసే అక్రమ రవాణా జరగడానికి వీలు లేదని పేర్కొన్నారు.
News November 26, 2025
iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
News November 26, 2025
Official: అహ్మదాబాద్లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.


