News May 21, 2024
ఈవీ నూతన విధాన మార్గదర్శకాల జారీకి సిద్ధమైన కేంద్రం

విద్యుత్ వాహనాల తయారీపై రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టతకు ఆయా పరిశ్రమ వర్గాలతో త్వరలో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. EV ప్రాజెక్టుపై సుమారు రూ.4,150కోట్లు పెట్టుబడి పెడితే పన్నుల తగ్గింపు, పలు రాయితీలు ఇచ్చేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా ఆయా సంస్థలు మూడేళ్లలో తమ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయిదేళ్లలో 50% విడిభాగాలను మన దేశంలో ఉత్పత్తి చేయాలి.
Similar News
News December 18, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News December 18, 2025
క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ను భూమిలో వేయాలి.
News December 18, 2025
పాపం.. ఆయనకు ఒక్కరే ఓటేశారు!

TG: నిన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా యాదాద్రి(D) అడ్డగూడూర్(M) ధర్మారంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకటో వార్డులో మొత్తం 119 ఓట్లుండగా కప్పల గోపికి 118 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థికి ఒకే ఓటు పడింది. ఇక ఆదిలాబాద్(D) ఉండంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్ తొలుత 4 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన రీకౌంటింగ్ కోరగా చివరికి మహేందరే 6 ఓట్లతో గెలుపొందారు.


