News January 18, 2025
ఓర్వకల్లులో ఈవీ పార్కు.. 25వేల ఉద్యోగాలు!

AP: రాష్ట్రంలో పీపుల్ టెక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన పార్కు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మొబిలిటీ వ్యాలీలో రూ.1,800 కోట్ల వ్యయంతో 1200 ఎకరాల్లో ఈ వాహన పార్కును నిర్మించనుంది. ఇది పూర్తయితే దాదాపు 25 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Similar News
News January 23, 2026
రెండు వారాల్లో గ్రీన్లాండ్పై క్లారిటీ: ట్రంప్

గ్రీన్లాండ్ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. ఈ జాతులతో అధిక ఆదాయం

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారింది. మేలైన జాతి రకాలతో మంచి ఆదాయం సాధించవచ్చు. పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార, గ్రామ ప్రియ, శ్రీనిధి రకాలతో మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అధిక మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ కోళ్ల జాతులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


