News March 16, 2024

పదేళ్లయినా రాజధాని ఎక్కడో చెప్పలేకపోతున్నారు:రేవంత్

image

AP: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని విమర్శించారు.

Similar News

News November 17, 2025

డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్‌కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.

News November 17, 2025

డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్‌కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.