News March 16, 2024
పదేళ్లయినా రాజధాని ఎక్కడో చెప్పలేకపోతున్నారు:రేవంత్

AP: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని విమర్శించారు.
Similar News
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 17, 2025
భారత్పై పాకిస్థాన్ విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.
News November 17, 2025
పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.


