News March 20, 2025
60ఏళ్లు గడిచినా రైళ్ల వేగంలో మార్పేది?.. నెట్టింట విమర్శలు

పొరుగు దేశాలు అక్కడి రైళ్ల వేగాన్ని రెట్టింపు చేస్తే ఇండియా మాత్రం ఇంకా 120-130KMPH వేగం వద్దే ఆగిపోయిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనికోసం 1969లో మొదలైన రాజధాని EXPను ఉదహరిస్తున్నారు. ఇది 55ఏళ్ల క్రితమే 120KMPH వేగంతో నడిచే రైలుగా పరిచయమైందంటున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు 130KMPHతో అందుబాటులోకి వచ్చిందని, ఆరు దశాబ్దాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News March 21, 2025
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.
News March 21, 2025
ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.
News March 21, 2025
SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.