News June 22, 2024
66 ఏళ్లొచ్చినా అయ్యన్న ఫైర్ బ్రాండే: సీఎం చంద్రబాబు

AP: స్పీకర్గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి CM చంద్రబాబు అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ BC నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉంది. NTR పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్లో ఆయన ఫైర్ బ్రాండే. గత ఐదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు’ అని కొనియాడారు.
Similar News
News November 16, 2025
నా వర్క్కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటోషూట్ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్కు పర్సనల్ నంబర్ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.
News November 16, 2025
ప్రభుత్వం విఫలం.. క్వింటాల్కు ₹2వేల నష్టం: KTR

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.


