News February 6, 2025

ఏనుగులూ పగబడతాయ్!

image

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.

Similar News

News November 19, 2025

ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

image

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్‌ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.

News November 19, 2025

నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

* గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED

News November 19, 2025

30ఏళ్ల పాత కారుకు రూ.10లక్షలు ఆఫర్.. ఎందుకంటే?

image

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన కెరీర్ తొలినాళ్లలో కొన్న మారుతి 800 కారును తిరిగి పొందేందుకు ఇన్‌స్టాలో భారీ ఆఫర్ ఇచ్చారు. కారు ఎక్కడుందో కనుక్కొని తెచ్చిస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పారు. తాజాగా ఈ కారు ఎక్కడుందో గుర్తించిన కొందరు టోయింగ్ వ్యాన్‌పై తీసుకొచ్చి ఆయనకు అందించారు. కారును చూసి పొంగిపోయిన ఆయన చెప్పినట్లుగానే రూ.10లక్షల చెక్ అందించారు. 1994లో ఈ కారును రూ.1.10లక్షలకు కొన్నట్లు తెలిపారు.