News March 30, 2024
చనిపోయినా.. ఇద్దరి జీవితాలు నిలబెట్టిన ప్రముఖ నటుడు

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో <<12952187>>కన్నుమూయడంతో<<>> ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన కొన్నేళ్ల కిందటే నేత్ర దానానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరణించడంతో ఆయన కళ్లను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సేకరించారు. వాటిని మరో ఇద్దరు అంధులకు అమర్చుతామని తెలిపారు. బాలాజీ చేసిన గొప్ప పనిని అభిమానులు కొనియాడుతున్నారు. చనిపోయినా ఇద్దరిలో ఆయన బతికే ఉంటారని పేర్కొంటున్నారు.
Similar News
News April 7, 2026
టికెట్ ధరల్ని పెంచిన ఎయిరిండియా

గ్లోబల్ మార్కెట్లో విమాన ఇంధన ధరలు పెరగడంతో ఎయిరిండియా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల ఛార్జీలను పెంచింది. దేశీయంగా దూరాన్ని బట్టి ప్రయాణికులపై ₹299 నుంచి ₹899 వరకు అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ రూట్లలో గరిష్ఠంగా 280 డాలర్ల వరకు ఇంధన సర్ఛార్జీని పెంచారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం.
News April 7, 2026
పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో.. రాజ్నాథ్ వార్నింగ్

భారత్తో యుద్ధం వస్తే ఈసారి కోల్కతా వరకు వస్తామంటూ పాక్ మంత్రి ఖవాజా పలికిన <<19571096>>ప్రగల్భాలపై<<>> రక్షణ మంత్రి రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసన్నారు. ‘ఖవాజా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 55 ఏళ్ల కిందట ఇలాంటి మాటల వల్లే పాక్ రెండు ముక్కలైన విషయాన్ని మర్చిపోవద్దు’ అని చురకలంటించారు.
News April 7, 2026
అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.


