News August 30, 2024
సీఎం చెప్పినా అమలు కాని ఆదేశాలు

TG: వినాయక మండపాలకు <<13971397>>ఉచిత కరెంట్ <<>>ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మండపాలకు దరఖాస్తు చేసుకుంటున్న నిర్వాహకుల నుంచి విద్యుత్ శాఖ రూ.1000 వసూలు చేస్తోంది. డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ కరెంట్పై తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Similar News
News December 15, 2025
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News December 15, 2025
ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.
News December 15, 2025
NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీపుల్ డిజబిలిటీస్ (<


