News August 30, 2024
సీఎం చెప్పినా అమలు కాని ఆదేశాలు

TG: వినాయక మండపాలకు <<13971397>>ఉచిత కరెంట్ <<>>ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మండపాలకు దరఖాస్తు చేసుకుంటున్న నిర్వాహకుల నుంచి విద్యుత్ శాఖ రూ.1000 వసూలు చేస్తోంది. డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ కరెంట్పై తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Similar News
News December 14, 2025
ఈ నెల 20న కొత్త సర్పంచ్లకు బాధ్యతలు

TG: పంచాయతీ ఎలక్షన్స్లో ఎన్నికైన కొత్త సర్పంచ్లు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణం స్వీకారం చేసేలా అపాయింట్మెంట్ డేను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ గెజిట్ జారీ చేసింది. ఆ రోజు నుంచి 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచ్లు బాధ్యతలు చేపట్టాక పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరనుంది.
News December 14, 2025
జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

AP: రాష్ట్రంలో పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే జనవరి 2 నుంచి 11 రోజులపాటు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 36వ బుక్ ఫెస్టివల్ జరగనుంది. రోజూ 6PMకు సందర్శన మొదలవుతుంది. లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. డైలీ సాహిత్య సదస్సులు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. కార్యక్రమ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ను నిర్వాహకులు ఆహ్వానించారు. తాజాగా పుస్తక ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు.
News December 14, 2025
ఆదివారం ఏం కొనాలి? ఏం కొనకూడదు?

ఆదివారం ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి, ఇనుము, ఫర్నిచర్, హార్డ్వేర్, వాహన వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టానికి, పేదరికానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కంటికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, రాగి, ఎరుపు రంగు వస్తువులు కొనడం మాత్రం శుభప్రదమని అంటున్నారు. ఇది ఆర్థిక ఎదుగుదలకు, సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుందని వివరిస్తున్నారు.


