News August 30, 2024

సీఎం చెప్పినా అమలు కాని ఆదేశాలు

image

TG: వినాయక మండపాలకు <<13971397>>ఉచిత కరెంట్ <<>>ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మండపాలకు దరఖాస్తు చేసుకుంటున్న నిర్వాహకుల నుంచి విద్యుత్ శాఖ రూ.1000 వసూలు చేస్తోంది. డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ కరెంట్‌పై తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Similar News

News December 23, 2025

OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

image

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News December 23, 2025

‘పల్లె వెలుగు’ బస్సులూ EV ACవే ఉండాలి: CBN

image

AP: RTCలో ప్రవేశపెట్టే బస్సులు, ‘పల్లెవెలుగు’ అయినా సరే ఎలక్ట్రికల్ ఏసీవే ఉండాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘వచ్చే ఏడాది కొనే 1450 బస్సులూ ఈవీనే తీసుకోవాలి. 8819 డీజిల్ బస్సుల స్థానంలో EVలనే పెట్టండి. 8 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటినీ మార్చాలి. తిరుమల- తిరుపతి మధ్య రవాణాకు 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది’ అని వివరించారు. బస్సుల మెయింటెనెన్సును ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు.

News December 23, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

AP: శ్రీలంక ఉమెన్స్ జట్టును టీమ్ ఇండియా మరోసారి కట్టడి చేసింది. విశాఖలో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక ప్లేయర్లు 20 ఓవర్లలో 128/9 మాత్రమే స్కోర్ చేశారు. హర్షిత(33), కెప్టెన్ చమరి ఆటపట్టు(31), హాసినీ పెరేరా(22) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. గెలుపు కోసం టీమ్ ఇండియా 20 ఓవర్లలో 129 రన్స్ చేయాలి.