News July 15, 2024
రీఛార్జ్ ధరలు పెంచినా మెరుగుపడని సేవలు!

జియో, ఎయిర్టెల్, VI ఇటీవల టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచినా యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ తెలిపింది. కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యను 89% మంది ఎదుర్కొంటుండగా, 38% మందికి తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మెట్రో నగరాల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య స్వల్పంగా తగ్గినట్లు సర్వేలో తేలింది.
Similar News
News November 8, 2025
అశ్వని కురిస్తే అంతా నష్టం

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.
News November 8, 2025
సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News November 8, 2025
కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్, దూబే స్థానంలో నితీశ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.


