News October 30, 2024
వాళ్లిద్దరూ వ్యతిరేకించినా గెలుపు నాదే: నవాబ్

BJP, శివసేన వ్యతిరేకించినా మన్ఖుర్ద్ శివాజీనగర్ స్థానంలో గెలుపు తనదే అని NCP అభ్యర్థి నవాబ్ మాలిక్ అన్నారు. ఈ స్థానం నుంచి సురేశ్ పాటిల్ను శివసేన బరిలో దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘BJP కూడా పాటిల్కు మద్దతు తెలుపుతోంది. నా కుమార్తె బరిలో దిగుతున్న అనుశక్తి నగర్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయినా మాకు నష్టం లేదు. నేను, నా కుమార్తె సనా భారీ మెజారీటీతో గెలుస్తాం’ అన్నారు.
Similar News
News December 7, 2025
NMMS పరీక్షకు 86 మంది గైర్హాజరు: DEO

జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన(NMMS) పరీక్షను ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో వెల్లడించారు. 2654 మంది విద్యార్థులు హాజరుకాగా, 2568 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 86 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.
News December 7, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్గా జో రూట్ ఖాతాలో అన్వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.
News December 7, 2025
సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్నాథ్ సింగ్

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ ఈ కామెంట్లు చేశారు.


