News October 5, 2025
వీళ్లు వేదాలు చదివినా వ్యర్థమే..

దైవభక్తి లేని వ్యక్తులు వేదాలు చదివినా వ్యర్థమే అని ‘భక్తి యోగం’ తెలుపుతోంది. దాని ప్రకారం.. ‘భక్తి లేకుండా ధర్మాలను ఆచరించడం, దానాలు చేయడం, కఠిన తపస్సులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాలుగు వేదాలు కంఠస్తం చేసినా వ్యర్థమే. ఈ కర్మలన్నీ ముఖ్య సాధనాలుగా భావించే భక్తి ఆ వ్యక్తిలో లేనప్పుడు ఆ కార్యాలన్నీ నిరుపయోగమైనవిగా మారతాయి. భగవంతునిపై భక్తియే సర్వశ్రేష్ఠమైనది, ముఖ్యమైనది’. <<-se>>#Daivam<<>>
Similar News
News October 5, 2025
118 APP పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పోస్టులకు <
News October 5, 2025
అమ్మ అవ్వాలనుకుంటే ఇలా సిద్ధంకండి

మాతృత్వం అనేది ఒక వరం. దీనికోసం ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని, లేదంటే పుట్టే బిడ్డ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారంలో ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ చేర్చుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ డైట్లో ఉండేలా చూడాలి. ఆలివ్ ఆయిల్ను వాడితే గర్భాశయానికి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది’ అని చెబుతున్నారు.
News October 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 26 సమాధానాలు

1. రాముడు సూర్య వంశానికి చెందినవాడు.
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ‘పరీక్షిత్తు’.
3. విష్ణువు కాపలాదారులు జయవిజయులు.
4. కార్తికేయ స్వామికి 6 తలలుంటాయి.
5. హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించారు.
<<-se>>#IthihasaluQuiz<<>>