News March 17, 2024
5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. కానీ ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాలులోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.
News December 8, 2025
మద్యం విక్రయాలపై కఠిన నిషేధం: సీపీ సునీల్ దత్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగే మూడు విడతల పోలింగ్కు ముందు రెండు రోజులు సాయంత్రం 5 గంటల నుంచి, పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు.
News December 8, 2025
ఖమ్మం: ఉద్యోగులకు కోడ్ ఆఫ్ కండక్ట్.. కరచాలనం చేసినా తప్పే!

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులతో కరచాలనం చేసినా, అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించినా అది ఎన్నికల నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుందని సంఘం హెచ్చరించింది. అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, అది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే, సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.


