News April 14, 2025
సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా రూ.లక్ష.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)కు చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్కు, బౌలర్లు తీసే ప్రతి వికెట్కు లక్ష పాకిస్థానీ రూపాయల($356) చొప్పున పాలస్తీనా చారిటబుల్ సంస్థలకు విరాళంగా ఇస్తామని ప్రకటించింది. అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాటికి ప్రాధాన్యత ఇస్తామంది. కరాచీ కింగ్స్తో తొలి మ్యాచ్ తర్వాత 1.5M PKRను డొనేట్ చేసినట్లు తెలిపింది.
Similar News
News April 15, 2025
పోలీసింగ్లో సౌతిండియా టాప్.. AP, TG ర్యాంకులు ఎంతంటే?

ఫోర్త్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం పోలీసింగ్, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఈ విభాగాల్లో కర్ణాటక టాప్ ప్లేస్ దక్కించుకోగా AP, TG, KL, TN టాప్-5లో ఉన్నాయి. బెంగాల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది సర్వేలో TG 11వ స్థానంలో నిలవగా ఈసారి మూడో ప్లేస్కి దూసుకొచ్చింది. ఇక గత పదేళ్లలో జైళ్లలోని ఖైదీల సంఖ్య 50శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
News April 15, 2025
రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

AP: రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
News April 15, 2025
ఈ నెల 21న ఇంటర్ ఫలితాలు విడుదల?

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చింది. వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారంలో పూర్తి చేసి, 21న ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం. ఫలితాల కోసం 9.96 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. Way2News యాప్, బోర్డు అధికారక సైట్లో ఫలితాలు పొందవచ్చు.