News July 8, 2024

కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలు లేవనెత్తుతాం: పురందీశ్వరి

image

AP: కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలను లేవనెత్తుతామని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు NDA పదేళ్ల పాలనలో దేశంలో అద్భుత ప్రగతి ఉందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్బర్ భారత్‌కు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

image

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.

News November 8, 2025

ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను ప్రారంభించిన చైనా

image

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్‌హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్‌డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.

News November 8, 2025

పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

image

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.