News February 6, 2025
రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..

అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.
Similar News
News October 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 47 సమాధానాలు

1. దశరథ మహారాజు కుల గురువు ‘వశిష్ఠుడు’.
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ‘ఇరావంతుడు’.
3. దేవతల తల్లి ‘అధితి’.
4. శివుడు నర్తించే రూపం పేరు ‘నటరాజ’.
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరు ‘చంద్రమతి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 26, 2025
మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం: మహేశ్ గౌడ్

TG: DCCల నియామకంపై తమ అభిప్రాయాలు తీసుకున్నట్లు PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చిట్చాట్లో తెలిపారు. ‘మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ విషయంలో CM రేవంత్ సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. మేం ఎప్పుడూ హైకమాండ్ రాడార్లోనే ఉంటాం. మంత్రుల వివాదంపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చాం. ఎంత పెద్దవాళ్లు అయినా పార్టీకి లోబడే పనిచేయాలి. జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
News October 26, 2025
జూబ్లీహిల్స్లో సీఎం ప్రచార షెడ్యూల్ ఖరారు

TG: సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. డివిజన్ల వారీగా ఈనెల 30, 31 తేదీల్లో తొలి విడత, NOV 4, 5 తేదీల్లో రెండో విడత ప్రచారం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ కుమారుడి బారసాల ఉత్సవంలో పాల్గొని ఆశీర్వదించారు. ఇవాళ రాత్రికి రేవంత్ HYD చేరుకోనున్నారు.


