News March 15, 2025

జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో మృతిచెందిన‌ చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హ‌త్యా రాజ‌కీయాలు మాన‌డం లేదని మండిపడ్డారు. YCP ర‌క్త‌చ‌రిత్ర‌కు TDP సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాకరమన్నారు.

Similar News

News November 28, 2025

పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

image

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.

News November 28, 2025

మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

image

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 28, 2025

HYD మెట్రోకు 8 ఏళ్లు

image

TG: రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన HYD మెట్రో మొదలై నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 28న PM మోదీ ఫస్ట్ ఫేజ్‌ను ప్రారంభించగా 29 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3 కారిడార్లలో రోజూ 57 రైళ్లు దాదాపు 1,100 ట్రిప్పులు తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. నిత్యం 4-5లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ మెట్రోను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.