News April 12, 2025
ధోనీ వచ్చినా పాత కథే పునరావృతం

తమ జాతకాన్ని మార్చేందుకు దిగ్గజ కెప్టెన్ ధోనీపైనే సీఎస్కే ఆధారపడింది. రుతురాజ్ గాయం అనంతరం ధోనీని కెప్టెన్గా ప్రకటించింది. ఇక కొత్త సీఎస్కేని చూస్తారంటూ ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకొన్నారు. తీరా చూస్తే పాత కథే రిపీట్ అయింది. KKR చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 6 మ్యాచులాడిన CSK ఒకటే గెలిచింది. అయితే, ధోనీపై తమకు నమ్మకముందని, మళ్లీ పుంజుకుంటామని చెన్నై ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 2, 2026
మధ్యలో ఉండాలనే అమరావతి ఎంపిక: లోకేశ్

AP: అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై మద్దతిచ్చిన అందరికీ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 3 రాజధానుల పేరుతో జగన్ డ్రామా చేసినా, ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతికే మద్దతు పలికారని ఢిల్లీలో పేర్కొన్నారు. ఈ విజయం అక్కడి రైతులదేనన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలనే అమరావతిని ఎంపిక చేశామన్నారు. జగన్ చెప్పిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో తమ పార్టీ ఎంపీ అత్యధిక మెజారిటీతో గెలిచారన్నారు.
News April 2, 2026
పబ్లిక్ ప్లేసుల్లో పిల్లలపై కోప్పడుతున్నారా?

బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెల్త్ ఎక్స్పర్టులు సూచిస్తున్నారు. ‘తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పబ్లిక్ ప్లేసుల్లో మర్యాదగా, గౌరవంగా మాట్లాడితే, దయతో వ్యవహరిస్తే వాళ్లూ అదే ఫాలో అవుతారు. మంచి నడవడిక, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అరవడం, తిట్టడం, చెడుగా మాట్లాడటం వారిపై ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో వాళ్లూ అలానే ప్రవర్తించవచ్చు’ అని చెబుతున్నారు.
News April 2, 2026
IIFCLలో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అప్లై చేశారా?

33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL), న్యూఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. MBA/ PGDBMలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి 10.04.26 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.iifcl.in చూడండి.


