News August 6, 2024
జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా జగన్కు అభద్రతే: లోకేశ్

AP: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా మాజీ సీఎం జగన్కు అభద్రతాభావం పోలేదని మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో ఎద్దేవా చేశారు. ‘ప్రస్తుతం జగన్కు 58 మంది సెక్యూరిటీ, 10 మంది సాయుధ గార్డులు, రెండు ఎస్కార్ట్ టీమ్స్, రెండు ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
Similar News
News December 29, 2025
మంత్రులు, MLAలు సిద్ధంగా ఉండాలి: CM

TG: నీళ్ల సెంటిమెంట్తో BRS తమపై అటాక్ చేయాలని చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష నేతల విమర్శలు, ఆరోపణలను సమర్థంగా తిప్పి కొట్టాలి. JAN 1న సాయంత్రం 4 గం.కు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నదీ జలాలు, నీటి వాటాలపై జరిగిన తప్పిదాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి’ అని తెలిపారు.
News December 29, 2025
పోలీసులు చెబితే నేరం చేసినట్టా: ఐబొమ్మ రవి

TG: బెట్టింగ్ యాప్స్తో సంబంధాలు ఉన్నాయని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఇమంది రవి చెప్పారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘నా పేరు ఐబొమ్మ రవి కాదు. ఇమంది రవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టా. నేను ఎక్కడికీ పారిపోలేదు. కూకట్పల్లిలోనే ఉన్నాను. వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతా. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను’ అని అన్నారు.
News December 29, 2025
మచిలీపట్నం నుంచి HYD ఫ్యూచర్ సిటీకి ఎక్స్ప్రెస్వే: సత్యకుమార్

APలో పెట్టుబడుల ఆకర్షణకు, సంపద సృష్టికి హైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. కొత్తగా మచిలీపట్నం నుంచి HYD ఫ్యూచర్ సిటీ వరకు, అమరావతి నుంచి బెంగళూరు వరకు ఎక్స్ప్రెస్వేలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతర మెట్రో నగరాలకు దీటుగా అమరావతి చుట్టూ రూ.38 వేల కోట్లతో 190km ORR నిర్మిస్తామన్నారు. వీటికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.


