News August 6, 2024

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా జగన్‌కు అభద్రతే: లోకేశ్

image

AP: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా మాజీ సీఎం జగన్‌కు అభద్రతాభావం పోలేదని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. ‘ప్రస్తుతం జగన్‌కు 58 మంది సెక్యూరిటీ, 10 మంది సాయుధ గార్డులు, రెండు ఎస్కార్ట్ టీమ్స్, రెండు ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు.

Similar News

News December 11, 2025

వంటింటి చిట్కాలు

image

* బెండకాయ కూర వండేటప్పుడు రెండు చుక్కల వెనిగర్ కలిపితే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.
* ఫ్లాస్క్‌లో దుర్వాసన పోవాలంటే, ఓ చెంచాడు పంచదార వేసి బాగా కుదిపి గోరువెచ్చని నీటితో కడగాలి.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఉప్మా రవ్వను ప్లాస్టిక్ కవర్లో పోసి ఫ్రిజ్ లో ఉంచితే పురుగు పట్టకుండా చాలా కాలం తాజాగా ఉంటుంది.

News December 11, 2025

ధాన్యం కొనుగోళ్లు.. రూ.4,085 కోట్లు చెల్లింపు

image

AP: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతేడాది కంటే ఈ ఏడాది 32% అదనంగా ధాన్యం సేకరించి, 24 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.

News December 11, 2025

ప్రభుత్వం మారినా బంగ్లాలో మార్పులేదు!

image

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారినా అమాయకుల హత్యలు, చిత్రహింసలు మాత్రం ఆగలేదని మానవహక్కుల సంస్థలు వెల్లడించాయి.<<18161586>> షేక్ హసీనా<<>> దేశం నుంచి వెళ్లిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని చాలామంది భావించారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలోనూ ఆ కల నెరవేరలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 37 ఎన్‌కౌంటర్లు జరగగా, 95 మంది కస్టడీలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.