News October 2, 2024
సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.
Similar News
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 5, 2026
సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్కే ఉంది. తాజాగా యాషెస్లో ఆయన 41వ సెంచరీ సాధించారు.
News January 5, 2026
అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.


