News October 2, 2024
సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.
Similar News
News December 13, 2025
దూసుకెళ్తున్న కోడి గుడ్ల ధరలు

APలో గుడ్ల ధరలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ విజయవాడలో 100 గుడ్ల ధర అత్యధికంగా ₹690గా ఉంది. అనపర్తి, తణుకులో ₹665, విజయనగరం, శ్రీకాకుళంలో ₹664, చిత్తూరులో ₹663, విశాఖలో ₹660 పలుకుతోంది. రిటైల్లో ₹8-10కి అమ్ముతున్నారు. 4 నెలల కిందట ఈ రేటు రూ.5.50గా <<18317956>>ఉండేది<<>>. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతోనే రేట్లు అధికమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.
News December 13, 2025
22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.
News December 13, 2025
పొదుగు పెద్దగా ఉంటేనే ఎక్కువ పాలు వస్తాయా?

కొందరు గేదెను కొనుగోలు చేసే ముందు దాని పొదుగును చూస్తారు. పెద్ద పొదుగు ఉంటే అది ఎక్కువ పాలు ఇస్తుందని అనుకుంటారు. పెద్ద పొదుగు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ పాలు ఇవ్వదు. పాలు పితికిన తర్వాత పొదుగు గాలి తీసిన బెలూన్లా మెత్తగా, ముడతలు పడే గుణం ఉండాలి. అలా కాకుండా పాలు తీశాక కూడా గట్టిగా ఉంటే అది మాంసపు పొదుగుగా గుర్తించాలి. అది ఎక్కువ పాల దిగుబడికి పనికిరాదని భావించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


