News October 2, 2024

సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

image

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.

Similar News

News December 18, 2025

అంటే.. ఏంటి?: Espionage..

image

గూఢచర్యం (నిఘా)తో రహస్య, ముఖ్య సమాచారం సేకరించడాన్ని ఇంగ్లిష్‌లో Espionage అంటారు. ఇందుకోసం వ్యక్తులు లేదా జంతువులు లేదా ఇతర ప్రాణులు, డివైజ్‌లను వ్యక్తులు/సంస్థలు వాడుతాయి. ఈ పదం ఫ్రెంచ్ భాషలోని Espionnage (Spy) నుంచి పుట్టింది.
తరచుగా వాడే పర్యాయ పదాలు: Spying, Surveillance
– రోజూ 12pmకు ‘అంటే.. ఏంటి?’లో ఓ ఇంగ్లిష్ పదానికి అర్థం, పద పుట్టుక వంటి విషయాలను తెలుసుకుందాం.
Share it

News December 18, 2025

NHIDCLలో 64 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

News December 18, 2025

ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ నిరసన

image

TG: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. HYDలో BJP ఆఫీస్‌ ముట్టడికి బయల్దేరిన మహిళా నేతలను గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కరీంనగర్‌, నిజామాబాద్, వరంగల్‌లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసు సిబ్బంది అడ్డుకుంటున్నారు.