News April 11, 2025
పెండింగ్ కేసుల పరిష్కారానికి త్వరలో ఈవెనింగ్ కోర్టులు!

జిల్లా కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 785 ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ యోచిస్తోంది. ప్రస్తుత కోర్టు ప్రాంగణాల్లోనే సాధారణ పనివేళల అనంతరం 5pm-9pm మధ్య ఇవి పనిచేస్తాయని సమాచారం. గత 3 ఏళ్లలో రిటైరైన జడ్జీలను కాంట్రాక్టు పద్ధతిలో వీటిలో నియమిస్తారని తెలుస్తోంది. మైనర్ క్రిమినల్ కేసులు, 3 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించదగిన కేసులను ఈ కోర్టుల్లో విచారించనున్నారు.
Similar News
News September 15, 2025
15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 15, 2025
పత్తిలో కలుపు నివారణకు ఇలా చేయండి

* పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
* ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి.
* వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.
News September 15, 2025
విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.