News October 24, 2024
ఈవినింగ్ టైం బీటెక్.. గుడ్న్యూస్ చెప్పిన JNTUH

TG: పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి JNTUH గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం వేళ బీటెక్ చదువుకోవాలి అనుకునే వారికి JNTUHతో పాటు మరో 8 కాలేజీలకు అనుమతిచ్చింది. త్వరలో స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. కోర్సు కాలపరిమితి మూడేళ్లు కాగా ఒక్కో విభాగంలో 30 సీట్లు ఉంటాయి. పని చేస్తున్న సంస్థ కాలేజీకి 75km పరిధిలో ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.
Similar News
News January 21, 2026
జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు..

ముంబైలోని మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలు, తిరుమల, వెల్లూర్ స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, జమ్మూ వైష్ణో దేవి క్షేత్రాలు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. కోణార్క్ సూర్య దేవాలయం, శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయాలు విశిష్ట శిల్పకళకు, భక్తికి నిలయాలు. అరుణాచల, శ్రీకాళహస్తి క్షేత్రాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
News January 21, 2026
బంగ్లాదేశ్పై PIL… కోర్టు సీరియస్

బంగ్లాదేశ్లో హిందువులను హింసిస్తున్నందున ఆ దేశాన్ని క్రికెట్ టోర్నమెంట్ల నుంచి నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో PIL దాఖలైంది. లా విద్యార్థి దాఖలు చేసిన దీనిపై చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ సీరియస్ అయ్యారు. ‘ఇదేం పిటిషన్. ఆ దేశం మా పరిధిలోకి వస్తుందా? మేము అక్కడికి వెళ్లి విచారించాలా? ICC మా పరిధిలోదా?’ అని ప్రశ్నించారు. హెచ్చరికతో వదిలేస్తున్నామని, సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయని హితవు పలికారు.
News January 21, 2026
CEOగా తప్పుకున్న దీపిందర్

బ్లింకిట్, జొమాటో ప్లాట్ఫామ్స్ పేరెంట్ కంపెనీ ‘ఎటర్నల్’ CEOగా దీపిందర్ గోయల్ తప్పుకోనున్నారు. ఈ Feb 1 నుంచి బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ఈ బాధ్యతలు చేపట్టనుండగా, గోయల్ వైస్ ఛైర్మన్గా కొనసాగుతారు. ప్రస్తుత వ్యాపార పరిస్థితులకు తగ్గట్లు కొత్త మార్గాలు అన్వేషించేందుకు, అదే సమయంలో నాయకత్వ స్థాయిలో క్లియర్ ఫోకస్ ఉండేందుకే ఈ మార్పులు అని గోయల్ తెలిపారు.


