News September 25, 2024

CM అవ్వాలనుకున్న ప్రతిసారి డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యా: అజిత్ పవార్

image

CM అవ్వాలనుకున్న ప్రతిసారి తాను DyCM పదవికే పరిమితం అయ్యానని NCP నేత అజిత్ పవార్ అన్నారు. NCPని చీల్చి మాహాయుతి కూటమితో జ‌ట్టుక‌ట్టి ఆయ‌న ఐదోసారి DyCM ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. ఓ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ‘నాకు CM కావాలని ఉంది. కానీ నేను ముందుకు సాగలేకపోతున్నాను. నాకు అవకాశం రావడం లేదు’ అని అజిత్‌ అన్నారు. 2004 ఎన్నిక‌ల త‌రువాత అవ‌కాశం వ‌చ్చినా NCP దాన్ని వృథా చేసుకుంద‌ని అన్నారు.

Similar News

News September 18, 2025

అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

image

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.

News September 18, 2025

GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ: పవన్

image

AP: GST సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని Dy.CM పవన్ అన్నారు. అసెంబ్లీలో GST సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘GST తగ్గింపుతో అల్పాదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీఎస్టీ సంస్కరణల్లో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం. చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ’ అని పవన్ తెలిపారు.

News September 18, 2025

మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

image

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.