News January 7, 2025

అంద‌రూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది: బీజేపీ

image

2014 నుంచి ఇప్ప‌టి దాకా ప‌లు దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధానులు ఓడినవారు కొంద‌రైతే, వివిధ కార‌ణాల‌తో త‌ప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌తలు చేప‌ట్టాక US మొద‌లుకొని ఆస్ట్రేలియా వ‌ర‌కు ఎంద‌రో దేశాధినేత‌లు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. తాజాగా కెన‌డా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అంద‌రూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.

Similar News

News November 11, 2025

రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్‌ AMG G63 వ్యాగన్‌ మోడల్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్‌తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.

News November 11, 2025

ఇంటి బేస్‌మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

image

ఇంటి బేస్‌మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్‌మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 11, 2025

22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు: మంత్రి సత్యకుమార్

image

APలో 39L మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 22,861మందిలో సర్వైకల్, 9,963మందిలో బ్రెస్ట్, 26,639మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించామన్నారు. వీరిని బోధనాస్పత్రుల్లోని ఆంకాలజిస్టులు మరోసారి పరీక్షించి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందిస్తారని చెప్పారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మళ్లీ స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.