News November 27, 2024

EVMలు ట్యాంపరింగ్ అవ్వవు: కలెక్టర్

image

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.

Similar News

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

image

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.