News May 24, 2024
EVM ధ్వంసం ఘటనలో పలువురు సస్పెండ్.. వివరాలివే..!
రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టిన విషయంలో అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీకేశ్ తెలిపారు. GJC జూనియర్ కాలేజ్, సత్తెనపల్లిలో జూనియర్ లెక్చరర్గా పనిచేసే PV సుబ్బారావు (ప్రిసైడింగ్ ఆఫీసర్), వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న షేక్ షహనాజ్ బేగం (పోలింగ్ ఆఫీసర్ /అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్)ను విధుల నుంచి తొలగించామన్నారు.
Similar News
News September 29, 2024
గుంటూరు: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
News September 28, 2024
టెట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DRO
అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.
News September 28, 2024
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు చంద్రబాబు అమరావతిలో శనివారం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. అలాగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.