News August 7, 2025

ఈవీఎం OR బ్యాలెట్.. ఏ పద్ధతి కావాలి?

image

ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అంచనాలకు అందని విధంగా ఫలితాలు వస్తున్నాయని LoP రాహుల్ గాంధీ అంటున్నారు. EVMలు వద్దని, మళ్లీ బ్యాలెట్ పద్ధతి తేవాలని KTR ఇటీవల డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు BJP ఖండిస్తుండగా.. EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని EC కుండబద్దలు కొడుతోంది. ఓటర్లుగా మీరు ఏ విధానం కావాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News August 10, 2025

ఇవాళ్టి నుంచి తిరంగా యాత్రలు: మాధవ్

image

AP: ఇవాళ్టి నుంచి 14 వరకు తిరంగా యాత్రలు నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని, 15న బహిరంగ ప్రదేశాల్లో జెండా ఆవిష్కరణల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.

News August 10, 2025

కేటీఆర్ Vs కవిత.. రాఖీపే చర్చ!

image

TG: రాఖీ వేళ KTR, కవిత మధ్య దూరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అన్నా.. రాఖీ కట్టడానికి రానా?’ అని ఆమె మెసేజ్ చేయగా, ఆయన చాలా ఆలస్యంగా ‘నేను ఔట్ ఆఫ్ స్టేషన్’ అని రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వైరం వల్ల కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలొచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. కానీ KTR కావాలనే అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ చర్చపై మీ COMMENT?

News August 10, 2025

అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి

image

TG: పంచాయతీ మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుపై కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజైన్లు, వివరాల కోసం ప్రశ్నావళిని పంపుతామన్నారు.